గేట్ పరీక్ష
మన దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థల్లో(PSU) ఉద్యోగాలకి, ఎంటెక్, పీహెచ్డీ ప్రవేశాలకు; విదేశాల్లో కొన్ని విశ్వవిద్యాలయాల్లో ఎమ్మెస్ ప్రవేశాలకు GATE పరీక్షలో స్కోరును ప్రామాణికంగా తీసుకొని నేరుగా ప్రవేశాలు కల్పించడం లేదా మౌఖిక పరీక్షకు అర్హత కల్పించడం జరుగుతుంది. ఈ నియామకాల్లో ఆయా సంస్థల నిబంధనల దృష్ట్యా గేట్ స్కోరుకు 50-80 శాతం వెయిటేజీ ఉంటుంది. ఇది ముఖ్యంగా ఇంజనీరింగ్ విద్యార్థులకు బీటెక్ అయిన తరువాత మంచి జీతంతో ఉద్యోగం, ప్రోత్సాహకాలు, స్థిరమైన జీవితం కోసం కాంక్షించే వారికి గేట్ ఒక మంచి ఎంపిక. ఈ పరీక్ష ఏడాదికొక్కసారి ఫిబ్రవరి మొదటి, రెండవ వారంలో జరుగుతుంది. ఐఐటీ, ఐఐఎస్సీ, ఎన్ఐటీ లాంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో చదవాలని కలలుగనే వారు గేట్ పరీక్ష ద్వారా ఎం.టెక్ కోర్సులో ప్రవేశం పొంది, కోర్సు పూర్తి చేస్తూ ప్రాంగణ నియామకాల్లో ఎంపికయ్యి భారీ ప్యాకేజీలు అందుకునే ఆస్కారం ఉంది. గేట్ ద్వారా ఎం.టెక్ లో చేరిన వారికి నెలవారీ 12,400 రూపాయలు ఉపకార వేతనం అందుతుండటంతో ముఖ్యంగా పేద, మధ్య తరగతి విద్యార్థులు తమ చదువుకు, స్వంత ఖర్చులకు పెద్దగా ఇంట్లో వారిపై ఆధారపడనవసరం లేదు. అంతేకాకుం...