భారత దేశానికి ఉత్తరాన హిమాలయాలు ఎలా ఏర్పడ్డాయి?
మూడు వందల మిలియన్ ఏళ్ల క్రిందటి మాట..! అంటే 30కోట్ల సంవత్సరాల క్రితం… అనగనగా ఒక పేద్ద కుటుంబం. ఆ కుటుంబం ఎంతో కలిసి మెలసి సంతోషంగా జీవిస్తుండేవారు. ఎప్పుడూ ఒకర్నొకరు గట్టిగా హత్తుకునేంత గాఢమైన ప్రేమ వారి మధ్య ఉండేది. మరి అంత సంతోషంగా జీవిస్తున్న కుటుంబం అంటే విలన్లకి కళ్ళు కుడతాయి కదా.. ఈ విలన్ బాగా శక్తిమంతుడు. ఆ మాటలూ, ఈ మాటలూ చెప్పి కుటుంబం మధ్య చిచ్చు పెట్టాడు. ఫలితంగా కుటుంబం రెండు కింద చీలిపోయింది. అంతటితో ఆగకుండా విలన్ మళ్లీ ఆ రెండు కుటుంబాల్లో విడిగా దూరి ఒకరంటే ఒకరికి పడనీకుండా చేసాడు. ఈ రెండు కుటుంబాలూ అప్పడంలా మరిన్ని ముక్కలయ్యి ఎవరికి వారు బ్రతుకుతెరువుకి తలో దిక్కుకీ పోవడానికి సిద్ధమయ్యారు. వీరి మధ్యలో ఒక కుటుంబం. తల్లి అనంతమ్మ, తండ్రి అప్పయ్య, పిల్లాడు భరత్. నీకు ఈ గొడవలన్నీ ఎందుకు, పట్నమెళ్లి ఏదో పని చూసుకో నాయనా అని భరత్ కి తల్లితండ్రులు చెప్పడంతో ఒంటరి ప్రయాణం మొదలు పెట్టాడు. . భరత్ ఉత్తరం వైపు బయల్దేరాడు. ఒకటా రెండా 10 కోట్ల సంవత్సరాల పాటు గొప్ప సాహస యాత్ర చేసాడు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని మొత్తానికి ఐదు కోట్ల ఏళ్ల క్రితం తీరం చేరాడు. అక్కడ ఒక పెద్దన్నని ఢీకొని దందా